- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visakha KGH ఘటనపై పవన్ ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
విశాఖ కేజీహెచ్ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో మృతి చెందిన శిశువును ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ రాకపోవంతో దంపతులు బైక్పై 120 కిలో మీటర్లు ప్రయాణం చేసి తీసుకెళ్లారు...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ కేజీహెచ్ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో మృతి చెందిన శిశువును ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ రాకపోవంతో దంపతులు బైక్పై 120 కిలో మీటర్లు ప్రయాణం చేసి తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్ కావడంతో పవన్ కల్యాణ్ స్పందించారు. శిశువును తరలించేందుకు అంబులన్స్ ఇవ్వలేని కర్కశ ప్రభుత్వం ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రులను మెరుగుపర్చలేరు.. కానీ రాజధానిగా అభివృద్ధి చేస్తారట అని పవన్ వ్యంగ్యంగా విమర్శించారు. బిడ్డ మృతదేహాన్ని బైక్పై 120 కి.మీ తీసుకెళ్లిన ఆ తల్లిదండ్రులకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం కేటాయిస్తున్న వేల కోట్లు ఏమవుతున్నాయని పవన్ ప్రశ్నించారు.
Also Read...
Inhuman Incident: పసికందు మృతదేహంతో స్కూటీపై 120 కి.మీ ప్రయాణం
Next Story






